అక్టోబర్‌ 5,6,7వ తేదిలలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం 

అక్టోబర్‌ 5,6,7వ తేదిలలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

తిరుపతి, అక్టోబర్‌-3, 2009: తిరుమల తిరుపతి దేవస్థానముల దాససాహిత్య ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో అక్టోబర్‌ 5,6,7వ తేదిలలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం తిరుమల ఆస్థానమండంపం నందు ఘనంగా నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయం 5.30 నుండి 7.30 వరకు మాడ వీధులలో సంకీర్తన పరిక్రమణము, సామూహికభజనలు, ఉదయం 8.30 నుండి 12.30 వరకు కోలాటములు, సంకీర్తనలు, మద్యాహ్నం 2.30 నుండి 6.30 వరకు భజనలు, కోలాటములు, సాయంత్రం 7 గంటల నుండి సంగీత విభావరి నిర్వహిస్తారు. అక్టోబర్‌ 5వ తేదిన తిరుమల ఆస్థానమండపం నందు ప్రారంభ సమావేశం నిర్వహిస్తారు. అదేవిధంగా అక్టోబర్‌  7వ తేది ఉదయం 4.30గంటలకు అలిపిరి పాదాలమండపం వద్ద నుండి వేల సంఖ్యలో వచ్చిన భజనమండలుల సభ్యులచే సంప్రదాయ భజనలతో మెట్లపూజ చేస్తూ తిరుమలకు చేరుకుంటారు.

అక్టోబర్‌ 4వ తేదిన పౌర్ణమి సందర్భంగా తిరుమల మాడవీధులలో సాయంత్రం 7 గంటలకు స్వామివారు గరుడవాహనంపై ఊరేగుతూ భక్తులకు కనువిందైన దర్శనం ఇస్తారు.

శ్రీవారికి చిత్రహారతి కార్యక్రమంలో భాగంగా స్థానిక మహాతి ఆడిటోరియం నందు  అక్టోబర్‌ 4వ తేదిన సాయంత్రం  6 గంటలకు ”సీతారామకల్యాణం” చలన చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తారు. రవి, జయప్రద, గుమ్మడి తదితరులు నటించగా కె.వి.మహదేవన్‌ సంగీతం సమకూర్చారు.
 
కనుక పురప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.