టిటిడి పరిపాలనా భవనంలో స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
టిటిడి పరిపాలనా భవనంలో స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
తిరుపతి, 2020 ఆగస్టు 14: భారత స్వాతంత్య్ర దినం ఆగస్టు 15న నిర్వహించే వేడుకలకు టిటిడి ఏర్పాట్లు పూర్తి చేసింది. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం ప్రాంగణంలో గల పరేడ్ మైదానంలో వేదికను అందంగా ముస్తాబు చేశారు. శనివారం ఉదయం 8.30 గంటలకు పంద్రాగస్టు వేడుకలు ప్రారంభమవుతాయి. జెండా వందనం అనంతరం టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్కుమార్ సింఘాల్ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.