AYODHYA KANDA AKHANDA PARAYANAM HELD _ అయోధ్య‌కాండ‌ అఖండ‌ పారాయణంతో మార్మోగిన తిరుమ‌ల‌గిరులు

Tirumala, 11 February 2024: The Seventh Edition of Ayodhyakanda Akhanda Parayanam was held at the Nada Neerajanam stage in Tirumala on Sunday.

SVBC telecasted the program live from 7 am to 9 am for the sake of global devotees.

A total of 155 slokas from 22 to 25 Sargas in Ayodhyakanda and 25 slokas of Yogavasishtam and Dhanvantari Mahamantram were recited.

SV Veda Vijnana Peetham, SV Vedic University, TTD Vedic Scholars, TTD Sambhavana Scholars, Sri Annamacharya Project, National Sanskrit University Scholars, devotees participated in this spiritual program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

అయోధ్య‌కాండ‌ అఖండ‌ పారాయణంతో మార్మోగిన తిరుమ‌ల‌గిరులు

తిరుమ‌ల‌, 2024 ఫిబ్రవరి 11: లోక క‌ల్యాణార్థం శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఆదివారం ఉద‌యం 7 నుండి 9 గంటల వరకు 7వ‌ విడ‌త అయోధ్యా కాండ‌ అఖండ పారాయ‌ణంతో తిరుమ‌ల‌గిరులు మార్మోగాయి.

ఇందులో 22 నుండి 25వ‌ సర్గల వ‌ర‌కు గ‌ల 155 శ్లోకాలను పారాయణం చేశారు. యోగవాసిష్టం – ధన్వంతరి మహామంత్రం 25 శ్లోకాలు పారాయణం చేశారు. వేద పండితులు అఖండ పారాయ‌ణం చేయ‌గా ప‌లువురు భ‌క్తులు భ‌క్తిభావంతో వారిని అనుస‌రించి శ్లోక పారాయ‌ణం చేశారు.

ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠంకు చెందిన ప్రముఖ‌ పండితులు శ్రీ శేషాచార్యులు, శ్రీ అనంత, శ్రీ మారుతి శ్లోక పారాయణం చేశారు. అఖండ పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేద అధ్యాయ‌న సంస్థకు చెందిన వేద పారాయ‌ణ దారులు, రాష్ట్రీయ‌ సంస్కృత విశ్వ‌విద్యాల‌యానికి చెందిన పండితులు పాల్గొన్నా‌రు.

ఈ సందర్భంగా హైదరాబాదుకు చెందిన నాగరాజు బృందం రామనామ సంకీర్తనను కార్యక్రమ ప్రారంభంలో, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ రఘునాథ్ బృందం ” పాహిరామ ప్ర‌భో, పాహిరామ ప్ర‌భో….” సంకీర్తనను చివరిలో ఆలపించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ అధికారులు, పండితులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.