నవంబరు 5న డయల్ యువర్ ఈవో
నవంబరు 5న డయల్ యువర్ ఈవో
తిరుమల, 2022 నవంబరు 03: డయల్ యువర్ ఈవో కార్యక్రమం నవంబరు 5వ తేదీ శనివారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.