SPECIAL EVENTS IN SRI KODANDARAMALAYAM IN THE MONTH OF MAY _ మే నెలలో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు
మే నెలలో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి, 2024 మే 04: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మే నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.
• మే 11, 18, 25వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం ఆలయంలో ఊంజల్సేవ జరుగనుంది.
• మే 8వ తేదీ అమావాస్య సందర్భంగా ఆలయంలో ఉదయం 8 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. రాత్రి 7 గంటలకు శ్రీ కోదండరామస్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం కటాక్షించనున్నారు.
• మే 11వ తేదీన శ్రీ కోదండరామస్వామివారి పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహిస్తారు.
• మే 12వ తేదీన శ్రీ కోదండరామస్వామివారి పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.
• మే 23వ తేదీ పౌర్ణమి నాడు ఆలయంలో ఉదయం 8.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల ఊరేగి దర్శనం ఇవ్వనున్నారు.
– మే 29న శ్రీ కోదండరామస్వామివారు అన్నమాచార్య కళామందిరంకు వేంచేపు, ఆస్థానం.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.