NRISIMHA JAYANTI ON MAY 22 _ మే 22న తిరుమల‌లో శ్రీ నృసింహ జయంతి

TIRUMALA, 20 MAY 2024: Nrisimha Jayanti will be celebrated on May 22 at  Srivari Temple in Tirumala. 

Every year Nrisimha Jayanti is observed in the month of Vaisakha in the advent of Swati Nakshatra. A special abhishekam is performed on this occasion to the Moolamurti of Sri Yoga Narasimha Swamy.

As part of Vaisakha month celebrations, Sri Narasimha Swamy pooja will be performed at Vasantha Mandapam in Tirumala from 3 pm to 4.30 pm. This program will be telecast live by Sri Venkateswara Bhakti Channel for the sake of global devotees.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 22న తిరుమల‌లో శ్రీ నృసింహ జయంతి

తిరుమల, 20 మే 2024: తిరుమల‌ శ్రీవారి ఆల‌యంలో మే 22న నృసింహ జయంతి జరుగనుంది. ప్రతి ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో నృసింహ జయంతిని నిర్వహిస్తారు. శ్రీ యోగ నరసింహస్వామివారి మూల‌మూర్తికి ప్రత్యేక అభిషేకం చేస్తారు.

వసంత మండపంలో శ్రీ నరసింహస్వామి వారి పూజ

వైశాఖ మాస ఉత్సవాల్లో భాగంగా తిరుమల‌ వసంత మండపంలో మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంటల‌ వరకు శ్రీ నరసింహస్వామి వారి పూజ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.

ఆల‌య ప్రాశస్త్యం :

శ్రీవారి ఆల‌య మొదటి ప్రాకారంలో గర్భాల‌యానికి ఈశాన్యం వైపున గల‌ మండపంలో పడమరగా శ్రీ యోగ నరసింహస్వామివారి ఉప ఆల‌యం ఉంది. శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని శాస్త్ర ప్రకారం రూపొందించారు. ఇక్కడ స్వామివారు యోగముద్రలో ఉంటారు. స్వామివారికి నాలుగు చేతులుంటాయి. పైభాగంలో ఉన్న చేతుల్లో శంఖుచక్రాలు కనిపిస్తాయి. కింది రెండు చేతులు ధ్యాననిష్టను సూచిస్తాయి. క్రీ.శ 1330 నుంచి క్రీ.శ 1360 మధ్య కాలంలో నిర్మితమైన ఈ ఆల‌యంలో శ్రీ రామానుజాచార్యుల‌ వారు శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.