మొదటి ఘాట్‌లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి వైభవంగా ప్రత్యేక అభిషేకం

మొదటి ఘాట్‌లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి వైభవంగా ప్రత్యేక అభిషేకం

తిరుమల, 2023 డిసెంబ‌రు 10: తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులోని నడకమార్గం చెంత వెలసివున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి వైభవంగా ఆదివారం ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. కార్తీక మాసంలో స్వాతి తిరునక్షత్రం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ.

ఇందులో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో మూలమూర్తికి ఉదయం అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.