సెప్టంబరు 6న డయల్ యువర్ ఇ.ఓ
సెప్టంబరు 6న డయల్ యువర్ ఇ.ఓ
తిరుమల, 5- సెప్టెంబరు 2013 : ప్రతినెలా మొదటి శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఉదయం 8.30 గం||ల నుండి ఉదయం 9.30 గం||ల నడుమ నిర్వహించే డయల్ యువర్ ఇ.ఓ కార్యక్రమం సెప్టంబరు 6వ తారీఖున జరుగనుంది.
ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను తి.తి.దే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.జి. గోపాల్ గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చును. అందుకు భక్తులు సప్రదించవలసిన నెంబరు. 0877-2263261.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.