సెప్టెంబరు 15 నుండి 18వ తేదీ వరకు రిషికేష్‌లోని శ్రీ చంద్రమౌళేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

సెప్టెంబరు 15 నుండి 18వ తేదీ వరకు రిషికేష్‌లోని శ్రీ చంద్రమౌళేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుపతి, సెప్టెంబరు 06, 2013: తితిదే పరిధిలోని రిషికేష్‌ ఆంధ్ర ఆశ్రమంలో గల శ్రీ చంద్రమౌళేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 15 నుండి 18వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా సెప్టెంబరు 15న అంకురార్పణం, 16న పవిత్రప్రతిష్ఠ, 17న పవిత్ర సమర్పణ, 18వ తేదీన మహాపూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. రూ.500/- చెల్లించి ఇద్దరు గృహస్తులు ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది