ఆగస్టు 30న శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన

ఆగస్టు 30న శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన

తిరుపతి, ఆగస్టు 28, 2013: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో ఆగస్టు 30వ తేదీన శ్రీ కామాక్షి అమ్మవారికి లక్ష కుంకుమార్చన ఘనంగా జరుగనుంది. ఉదయం 8.00 గంటలకు శ్రీ విఘ్నేశ్వరపూజతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అనంతరం మొదటి విడత కుంకుమార్చన ఉదయం 11.30 గంటల వరకు నిర్వహిస్తారు. సాయంత్రం 4.00 నుండి 6.00 గంటల వరకు రెండో విడత కుంకుమార్చన జరుగనుంది. ఆ తరువాత నివేదన, దీపారాధన, హారతి, తీర్థప్రసాద వినియోగం చేస్తారు. రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు శ్రీ కామాక్షి అమ్మవారికి తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

గృహస్తులు(ఇద్దరు) రూ.200/- చెల్లించి లక్ష కుంకుమార్చన సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక లడ్డూ, కుంకుమప్రసాదం ఉచితంగా అందజేస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.