ఘనంగా అన్నమయ్య బహుళ ద్వాదశి

ఘనంగా అన్నమయ్య బహుళ ద్వాదశి

తిరుపతి, సెప్టెంబరు 02, 2013: పరమపవిత్రమైన ద్వాదశి తిథినాడు పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు శ్రీవారిలో ఐక్యమైన మహత్తర సందర్భాన్ని పురస్కరించుకుని తితిదే సోమవారం నాడు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ‘అన్నమయ్య బహుళ ద్వాదశి’ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా మధ్యాహ్నం 1.00 గంటకు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అంతకుముందు ఉదయం 9.30 నుండి 11.00 గంటల నుండి దినము ద్వాదశి సంకీర్తనలతో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోష్ఠిగానం నిర్వహించారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి తిరుపతికి చెందిన శ్రీమతి జంద్యాల కృష్ణకుమారి ”శ్రీకృష్ణజననం” అనే అంశంపై హరికథా పారాయణం చేశారు.

సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు హిందూ ధర్మప్రచార పరిషత్‌ ధార్మిక విజ్ఞాన పరీక్షల ప్రత్యేకాధికారి శ్రీ జి.దామోదరనాయుడు ”అన్నమయ్య థావతార వర్ణన” అనే అంశంపై ఉపన్యసించనున్నారు. రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంగీత కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు ఇన్‌చార్జ్‌ సంచాలకులు శ్రీ మునిరత్నంరెడ్డి, ఎఈవో శ్రీమతి పద్మావతి, ఇతర అధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
             
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది