జూన్ 23న బెంగళూరులో శ్రీనివాస కల్యాణం
జూన్ 23న బెంగళూరులో శ్రీనివాస కల్యాణం
తిరుపతి, జూన్ 22, 2013: కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా తితిదే శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూన్ 23వ తేదీన శ్రీనివాస కల్యాణం వైభవంగా జరుగనుంది.
బెంగళూరులోని తితిదే కల్యాణ మండపంలో ఆదివారం ఉదయం 10.00 గంటలకు స్వామివారి కల్యాణం వేడుకగా జరుగనుంది. శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ఓఎస్డి శ్రీ కె.రామకృష్ణ ఈ కల్యాణోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శ్రీవారి కల్యాణోత్సవాల సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.