జూలై 8 నుండి శ్రీ సుందరరాజస్వామివారి వార్షిక అవతార మహోత్సవాలు

జూలై 8 నుండి శ్రీ సుందరరాజస్వామివారి వార్షిక అవతార మహోత్సవాలు

తిరుపతి, 2012 జూలై 06: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు జూలై 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు వైభవంగా జరుగనున్నాయి.

మొదటిరోజైన జూలై 8వ తేదీ ఆదివారం ఉదయం శ్రీ సుందరరాజస్వామివారికి సహస్ర నామార్చన జరుగనుంది. ఉదయం 10.30 గంటల నుండి 12.00 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారికి వేడుకగా కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.30 గంటల వరకు ముఖమండపంలో శ్రీ సుందరరాజస్వామివారికి వైభవంగా అభిషేకం జరుగనుంది. సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల వరకు స్వామివారికి ఊంజల్‌ సేవ నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 7.15 గంటల నుండి 8.30 గంటల వరకు శ్రీ సుందర రాజస్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

రెండో రోజైన జూలై 9వ తేదీ సోమవారం ఉదయం శ్రీ సుందరరాజస్వామివారికి సహస్ర నామార్చన, అష్టాదళపాదపద్మారాధన సేవ జరుగనున్నాయి. ఉదయం 10.30 గంటల నుండి 12.00 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారికి వేడుకగా కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.30 గంటల వరకు ముఖమండపంలో శ్రీ సుందరరాజస్వామివారికి వైభవంగా అభిషేకం జరుగనుంది. సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల వరకు స్వామివారికి ఊంజల్‌ సేవ నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 7.15 గంటల నుండి 8.30 గంటల వరకు శ్రీ సుందరరాజస్వామివారు హనుమంత వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేయనున్నారు.

మూడో రోజైన జూలై 10వ తేదీ మంగళవారం ఉదయం శ్రీ సుందరరాజస్వామివారికి సహస్రనామార్చన జరుగనుంది. ఉదయం 10.30 గంటల నుండి 12.00 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారికి వేడుకగా కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.30 గంటల వరకు ముఖమండపంలో శ్రీ సుందరరాజస్వామివారికి వైభవంగా అభిషేకం జరుగనుంది. సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల వరకు స్వామివారికి ఊంజల్‌ సేవ నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 7.15 గంటల నుండి 8.30 గంటల వరకు శ్రీ సుందరరాజస్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఈ ఉత్సవాల కారణంగా జూలై 8 నుండి 10వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఊంజల్‌ సేవను ఆలయ అధికారులు రద్దు చేశారు.

శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాల పురాణ నేపథ్యాన్ని పరిశీలిస్తే చాలా సంవత్సరాల క్రితం ముష్కరులు మధురైలో ఉన్న అళగిరి పెరుమాళ్‌ కోయిల్‌ను కూల్చేందుకు ప్రయత్నించారట. ఆ సమయంలో అక్కడున్న అర్చకస్వాములు శ్రీ సుందరరాజస్వామివారి ఉత్సవమూర్తులను తిరుచానూరుకు తీసుకొచ్చారని ప్రచారంలో ఉంది. దానికి తగ్గట్టుగానే స్వామివారి విగ్రహాలు(ఉత్సవర్లు) పురాతనంగా కనిపిస్తున్నాయి. మహంతుల కాలంలో అనగా 1902వ సంవత్సరంలో మూలమూర్తులను తయారుచేసి ప్రతిష్ఠించినారని చరిత్ర ద్వారా తెలు స్తోంది. ఆ తరువాత సుందరరాజస్వామివారికి అనేక ఉత్సవాలు జరిగాయి. స్వామివారిని జ్యేష్ఠమాసంలో శతభిష నక్షత్రం నాడు తిరుచానూరుకు తీసుకొచ్చినందున ఆ రోజు నుండి ఉత్తరాభాద్ర నక్షత్రం నాటికి ముగిసేలా అవతార మహోత్సవాలను తితిదే వైభవంగా నిర్వహిస్తోంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.