జూలై 9న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

జూలై 9న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల, జూలై 01, 2013: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి వెలసివున్న తిరుమల దివ్యక్షేత్రంలో జూలై 16న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని జూలై 9వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.

సాధారణంగా ఆణివార ఆస్థానం ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి నాడు జరుపబడుతుంది. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరిరోజున జరుపబడే కొలువు కనుక ఈ ఉత్సవానికి ఆణివార ఆస్థానం అనిపేరు.
జూలై 9వ తేదీ ఉదయం 6.00 నుండి 11.00 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో స్వామివారి గర్భాలయంతో పాటు ఉప ఆలయాలు, పోటును శుద్ధి చేస్తారు. ఈ కారణంగా అష్టదళ పాదపద్మారాధన సేవ శ్రీవారి ఆలయంలో జరుపబడదు.

అదేవిధంగా జూలై 16న ఆణివార ఆస్థానం పర్వదినం కారణంగా శ్రీవారి ఆలయంలో తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను తితిదే రద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.