తితిదే పాఠశాలల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు

తితిదే పాఠశాలల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు

తిరుపతి, జనవరి-5, 2009: తిరుమల తిరుపతి దేవస్థానములకు చెందిన అన్ని పాఠశాలలోని ”విద్యార్థినీ విద్యార్థులకు” విద్యాశాఖ ఆధ్వర్యమున, తితిదే వైద్యశాఖవారి సహకారంతో ఆరోగ్యవర ప్రసాద పథకము” కింద ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమయిన వారికి చికిత్స చేయుదురు.

ఈ ఆరోగ్యవరప్రసాద పథకమును ప్రప్రధమముగా 06-1-2009వ తేదీన మంగళవారము  మధ్యాహ్నం 2.00 గంటలకు తిరుపతి శ్రీవేంకటేశ్వర ప్రాధమిక పాఠశాల యందు ప్రారంభించుచున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా తి.తి.దే కార్యనిర్వహణాధికారి డా||శ్రీకె.వి.రమణాచారి, తి.తి.దే సంయుక్త కార్యనిర్వహణాధికారి వి.శేషాద్రి, తి.తి.దే ముఖ్యవైద్యాధికారి డా|| పి.శారద మరియు తి.తి.దే విద్యాశాఖాధికారి డా||కె.నాగరాజు, హాజరవుతారు.

తి.తి.దే నిర్వహించే ఈ కార్యక్రమంలో 9 పాఠశాలలకు చెందిన 6 వేల మంది విద్యార్థినీ విద్యార్థులకు వైద్యపరీక్షలు, చికిత్సలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎస్‌.వి. ప్రాధమిక పాఠశాలలో ప్రారంభించే తొలి కార్యక్రమంలో పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు, మందులు ఇవ్వనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.