PATTU VASTRAMS PRESENTED _ తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన టిటిడి బోర్డు సభ్యులు డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి

PATTU VASTRAMS PRESENTED

Tirupati, 04 December 2021: In connection with the ongoing annual Karthika Brahmotsavams at Sri Padmavati temple in Tiruchanoor, the TTD board Ex-officio member and Chandragiri MLA Dr. Chevireddy Bhaskar Reddy on Saturday presented pattu vastrams to Sri Padmavati Devi.

He was received at the temple by the TTD JEO Sri Veerabrahmam.

The local MLA presents pattu vastrams to the Goddess ahead of the Gaja Vahanam which he brought by Padayatra from Tummalagunta Sri Kalyana Venkateswara temple up to Tiruchanoor.

Temple DyEO Smt Kasturi Bai, AEO Sri Prabhakar Reddy, Agama adviser Sri Srinivasacharyulu, and Archaka Sri Babuswami were present.

TWO UMBRELLAS PRESENTED

Representatives of Srimad Ramanuja Kainkarya Trust from Tiruninravuru, Tamilnadu presented two colorful umbrellas which will be decked during Gaja vahanam.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన టిటిడి బోర్డు సభ్యులు డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి

తిరుపతి, 2021 డిసెంబ‌రు 04: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి బోర్డు స‌భ్యులు, చంద్ర‌గిరి ఎమ్మెల్యే డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి శ‌నివారం ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. ఆల‌యం వద్ద డా. భాస్క‌ర్‌రెడ్డికి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం సంప్ర‌దాయబ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు.

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో గజ వాహనం సందర్భంగా తుమ్మ‌ల‌గుంట‌లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం నుంచి పట్టువస్త్రాలను స‌మ‌ర్పించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. తుమ్మలగుంట నుంచి తిరుచానూరుకు పాదయాత్రగా వచ్చి పట్టువస్త్రాలు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి క‌స్తూరిబాయి, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, అర్చ‌కులు శ్రీ బాబుస్వామి పాల్గొన్నారు.

రెండు గొడుగులు విరాళం

తమిళనాడులోని తిరునిన్రవూరుకు చెందిన శ్రీమద్ రామానుజ కైంకర్య ట్రస్టు ప్ర‌తినిధులు రెండు గొడుగులను కానుకగా అందించారు. ఈ గొడుగులను ఆలయం వద్ద టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మంకు అందించారు. బ్రహ్మోత్సవాల్లో గజ‌ వాహనం రోజున ఈ ట్ర‌స్టు త‌ర‌ఫున‌ గొడుగులు స‌మ‌ర్పించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.