తిరుపతి, తిరుమలలో బాలభజగోవిందం

తిరుపతి, తిరుమలలో బాలభజగోవిందం

 తిరుపతి,  మే-1,  2009: విశాఖపట్నం నుండి 2000 మంది బాలబాలికలు మే 2,3,4వ తేదిలలో తిరుపతి,తిరుమలలో భజగోవిందం కార్యక్రమంలో పాల్గొంటారు.

ఈ సందర్భంగా మే 2వ తేదిన ఉదయం 6గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద భజనలో పాల్గొంటారు. అనంతరం కాలినడక ద్వారా తిరుమలకు చేరుకుంటారు.

శ్రీవారికి చిత్రహారతి కార్యక్రమంలో భాగంగా మే 2వ తేదిన సాయంత్రం 6 గంటలకు స్థానిక మహతి ఆడిటోరియంనందు ఎన్‌.టి.ఆర్‌, అంజిలిదేవి, తదితరులు నటించిన  ”శ్రీరామపట్టాభిషేకం” చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తారు.

కనుక పురప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవల్సిందిగా కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.