తిరుమల శ్రీవారికి రూ.లక్ష విరాళం

తిరుమల శ్రీవారికి రూ.లక్ష విరాళం

తిరుపతి, సెప్టెంబరు 28, 2013: చిత్తూరు జిల్లా పాకాల మండలం కృష్ణాపురానికి చెందిన శ్రీ రేచర్ల జయంత్‌ పృథ్విరాజ్‌ అనే భక్తుడు శనివారం తిరుమల శ్రీవారికి లక్ష రూపాయలు విరాళంగా అందించారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో గల శ్రీ వేంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్టు కార్యాలయంలో ఈ మొత్తం డి.డిని దాత అందజేశారు. ఈ సొమ్మును శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు అన్నప్రసాద వితరణ కోసం ఖర్చు చేయాలని దాత కోరారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.