తిరుమల శ్రీవారికి రూ.20 లక్షల విరాళం

తిరుమల శ్రీవారికి రూ.20 లక్షల విరాళం

 తిరుపతి, ఆగస్టు 09, 2013: తిరుమల శ్రీవారికి శుక్రవారం రూ.20 లక్షలు విరాళంగా అందింది. చెన్నై చేపాక్కానికి చెందిన శ్రీ సెల్వన్‌ టి.లక్సన్‌ రూ.10 లక్షలు, మలేసియాకు చెందిన శ్రియ లక్ష్మి రూ.10 లక్షలు విరాళంగా అందించారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో గల శ్రీ వేంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్టు కార్యాలయంలో ఈ మొత్తం డి.డిలను దాతలు అందజేశారు. ఈ సొమ్మును తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు అన్నప్రసాద వితరణ కోసం ఖర్చు చేయాలని దాతలు కోరారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.