TEPPOTSAVAMS ENTERS DAY TWO _ తెప్పలపై శ్రీ సుబ్రమణ్యస్వామివారి అభయం 

తెప్పలపై శ్రీ సుబ్రమణ్యస్వామివారి అభయం
 
తిరుపతి, 02 జనవరి 2023: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం సాయంత్రం శ్రీ సుబ్రమణ్యస్వామివారు తెప్పలపై భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు తెప్పోత్సవం కన్నులపండుగగా జరిగింది. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై శ్రీ సుబ్రమణ్యస్వామివారు కపిలతీర్థం పుష్కరిణిలో ఐదు చుట్లు తిరిగారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఈ సందర్భంగా తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు.
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ పార్థసారథి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

TIRUPATI, 02 JANUARY 2023: The annual Teppotsavams in Sri Kapileswara Swamy temple entered the second day on Monday.

Sri Subrahmanya Swamy took out a celestial ride in five rounds on the finely decked float.

Deputy EO Sri Devendra Babu, AEO Sri Parthasaradhi,  and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI