నవంబర్‌ 21న మధ్యాహ్నం 12 గంటలకు పంచమీతీర్థం (చక్రస్నానం)

నవంబర్‌ 21న మధ్యాహ్నం 12 గంటలకు పంచమీతీర్థం (చక్రస్నానం)
 
తిరుపతి, నవంబర్‌-20,2009: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా నవంబర్‌ 21, శనివారం మధ్యాహ్నం 12.00 గంటలకు పంచమీతీర్థం (చక్రస్నానం) అంగరంగవైభవంగా జరుగుతుంది.

ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించడానికి ఫ్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధుల కొఱకు 21వ తేది ఉదయం 9 గంటలకు స్థానిక ప్రెస్‌క్లబ్‌ నుండి తితిదే వాహనం తిరుచానూరుకు బయలుదేరును. కావున మీడియా మిత్రులు ఈ అవకాశాన్ని  సద్వినియోగం చేసుకోగలరని మనవి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.