ముంబై లో వేడుకగా శ్రీవారి కల్యాణం

ముంబై లో వేడుకగా శ్రీవారి కల్యాణం

తిరుమల 25 ఫిబ్రవరి 2024: ముంబై మహానగరంలోని తూర్పు దోంభివలి ప్రాంతంలో ఆదివారం రాత్రి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణం వేడుకగా జరిగింది.

తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా శ్రీవారు శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ, టీటీడీ నిర్వహిస్తున్న సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని అభినందించారు. స్వామివారి కల్యాణం లో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి, ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ పెద్ద ఎత్తున ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది చెప్పారు. కల్యాణోత్సవం లో టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి, ఈవో శ్రీ ధర్మారెడ్డి, ఎంపి శ్రీ శ్రీకాంత్ షిండే, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించారు. రాత్రి 10 గంటలకు ఈ కార్యక్రమం ముగిసింది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయడమైనది