మే 1 నుండి 31వ తేది వరకు నాదనీరాజనం వేదిక‌పై పాల్గొనే క‌ళాకారులు

మే 1 నుండి 31వ తేది వరకు నాదనీరాజనం వేదిక‌పై పాల్గొనే క‌ళాకారులు

తిరుపతి, 2010 ఏప్రిల్‌ 30: తిరుమల శ్రీవారి ఆలయం ముందు ప్రతిరోజు దేశంలోని ప్రముఖ కళాకారులచేత నిర్వహిస్తున్న ”నాదనీరాజనం” కార్యక్రమం విశేష ప్రజాదరణ పొందుతున్నది.

ఈ కార్యక్రమాన్ని శ్రీవేంకటేశ్వర భక్తిఛానల్‌ ప్రతిరోజు సాయంత్రం 6-00 గంటల నుండి 7-30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న విషయం విధితమే. ఈ నాదనీరాజనం కార్యక్రమంలో మే  1వ తేది నుండి 31వ తేది వరకు పాల్గొను కళాకారుల వివరాలు తెలియజేస్తున్నాము.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.