వివరణ _ టిటిడి చైర్మన్, ఈవోల వాగ్వివాదం’ అనువార్త పూర్తిగా అవాస్తవం
వివరణ
టిటిడి చైర్మన్, ఈవోల వాగ్వివాదం’ అనువార్త పూర్తిగా అవాస్తవం
ఆంధ్రజ్యోతి దినపత్రిక నందు జూలై 27న ప్రచురితమైన ‘టిటిడిలో చైర్మన్ ఒ ఈవో, విఐపి దర్శనాల నియంత్రణపై టిటిడి చైర్మన్, ఈవోల వాగ్వివాదం’ అనువార్త పూర్తిగా అవాస్తవం.
శ్రీకృష్ణదేవరాయల 501వ జయంతి సందర్భంగా తితిదే పాలకమండలి అధ్యకక్షులు, ఇ.ఓ, జె.ఇ.ఓ, ప్రత్యేకాధికారి, ముఖ్యభద్రతాధికారి, ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి, దాససాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారిలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆంధ్రజ్యోతి ప్రచురించినట్లు చైర్మన్కు, ఇ.ఓకు మద్య ఎటువంటి వాగ్వివాదం జరుగలేదు.
కనుక ఈ విషయాన్ని రేపటి మీ దినపత్రిక నందు వివరణగా ప్రచురించాల్సిందిగా కోరడమైనది.
ప్రజాసంబంధాల అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు