SUBRAMANYA HOMAM CONCLUDES _ శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం

Tirupati, 2 Nov. 19: The two day Subramanya Homam concluded on Saturday in Kapileswara Swamy temple in Tirupati. 

Mahabhishekam was performed to Sri Subramanyam in the temple. Later in the evening celestial kalyanam of Sri Subramanya Swamy with Valli and Devasena was performed in a religious manner. 

On November 3, Navagraha Homam will be performed. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

 

శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం

 తిరుపతి, 2019 నవంబరు 02: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం ఘనంగా ముగిసింది.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజ, హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి మహాభిషేకం, కలశాభిషేకం, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు శ్రీ నవగ్రహ కలశస్థాపన, హోమం, లఘుపూర్ణాహుతి, విశేష దీపారాధన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం వైభవంగా జరుగనుంది.

నవంబరు 3న నవగ్రహ హోమం :

హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబరు 3వ తేదీ ఆదివారం నవగ్రహ హోమం జరుగనుంది. నవంబరు 4వ తేదీ సోమవారం నాడు శ్రీ దక్షిణామూర్తిస్వామివారి హోమం నిర్వహించనున్నారు.

 గృహస్తులు రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.