శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ క‌ళాశాలలో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం

శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ క‌ళాశాలలో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం

తిరుపతి, జూలై-11, 2008: శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్‌, తిరుపతి వారు 3 సంవత్సరముల వ్యవధిగల డిప్లమా ఇన్‌ ఎలక్ట్రానిక్స్‌ మరియు డిప్లమా ఇన్‌ కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్‌లో చేరుటకు అఖరు తేది. 19-7-2008 అని ఆ కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్‌  శ్రీరెడ్డివారిభాస్కర్‌రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆసక్తిగల మహిళా అభ్యర్థులు నేరుగా ఫ్రిన్సిపల్‌గారిని 15-7-2008 లోపు సంప్రదించవచ్చును.
ఈ కోర్సులో చేరుటకు కనీస విద్యార్హత 10వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండవలెను.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.