ఆగస్టు 28న నారాయణవనం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గోకులాష్టమి వేడుకలు

ఆగస్టు 28న నారాయణవనం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గోకులాష్టమి వేడుకలు

తిరుపతి, ఆగస్టు 22, 2013: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న నారాయణవనం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 28వ తేదీ బుధవారం గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. అదేవిధంగా గురువారం ఉట్లోత్సవం వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

బుధవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి మూలవర్లకు అభిషేకం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 గంటల నుండి 6.30 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం, రాత్రి 7.30  నుండి 8.30 గంటల వరకు స్వామివారికి నృత్య నివేదన చేయనున్నారు. అలాగే గురువారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి పంచాంగ శ్రవణం చేయనున్నారు. సాయంత్రం 5.00 గంటల నుండి 6.00 గంటల వరకుఉట్లోత్సవం, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు స్వామివారికి నృత్య నివేదన చేయనున్నారు.

ఈ సందర్భంగా ఈ రెండు రోజుల్లో తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.