ADDITIONAL EO REVIEWS ON PARAKAMANI ACTIVITY _ ప‌ర‌కామ‌ణి విభాగంపై టిటిడి అద‌న‌పు ఈవో స‌మీక్ష

Tirumala 06 Nov 2019 ; Additional EO Sri AV Dharma Reddy on Wednesday reviewed on Parakamani with the Principals of Various colleges. 

The meeting was held at Annamaiah Bhavan in Tirumala.  He urged, the principals of all the colleges falling under the purview of SV University should sent their students in counting the Hundi Collections. 

Parakamani DyEO Sri Venkataiah, Principals of 25 Colleges were also present. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

ప‌ర‌కామ‌ణి విభాగంపై టిటిడి అద‌న‌పు ఈవో స‌మీక్ష

తిరుమల, 2019 న‌వంబ‌రు 06: టిటిడి ప‌ర‌కామ‌ణి విభాగంపై టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి బుధ‌వారం తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో స‌మీక్ష నిర్వ‌హించారు. హుండీ కానుక‌ల లెక్కింపును వేగ‌వంతం చేసే అంశంపై ఎస్వీయు ప‌రిధిలోని ఇంజినీరింగ్‌, డిగ్రీ క‌ళాశాల‌లు, టిటిడి క‌ళాశాల‌ల‌ ప్రిన్సిపాళ్లతో చ‌ర్చించారు.

ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ టిటిడిలోని డిగ్రీ క‌ళాశాలల విద్యార్థుల‌తోపాటు ఎస్వీ యూనివ‌ర్సిటీ ప‌రిధిలోని ఇంజినీరింగ్‌, డిగ్రీ క‌ళాశాల‌ల విద్యార్థుల‌ను ప‌ర‌కామ‌ణిలో భాగ‌స్వాముల‌ను చేయాల‌ని కోరారు. ఆయా క‌ళాశాల‌ల ప్రిన్సిపాళ్లు సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలించి విద్యార్థుల సంఖ్య‌ను నిర్ధారించాల‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ప‌ర‌కామ‌ణి డెప్యూటీ ఈవో శ్రీ వెంక‌ట‌య్య‌, 25 క‌ళాశాల‌ల ప్రిన్సిపాళ్లు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.