BALAKANDA AKHANDA PARAYANAM ON DEC 25 _ డిసెంబరు 25న 14వ విడ‌త‌ బాలకాండ అఖండ పారాయ‌ణం

TIRUMALA, 20 DECEMBER 2022: The 14th Edition of Akhanda Balakanda Parayanam will be observed in Nas Neerajanam Platform at Tirumala on December 25.

 

This spiritual event will take place between 8:30am and 10:30am and will be telecasted live on SVBC for the sake of global devotees.

 

The Vedic Pundits and scholars will recite 134 Shlokas from the chapters 66-70 of Balakanda from the epic Ramayana.

 

Apart from this 25 Shlokas from Yoga Vasistyam and Dhanwantari Maha Mantram will also be recited seeking the well-being of the humanity.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

డిసెంబరు 25న 14వ విడ‌త‌ బాలకాండ అఖండ పారాయ‌ణం

తిరుమల, 2022 డిసెంబరు 20: లోక‌క‌ల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై డిసెంబరు 25న ఆదివారం 14వ విడ‌త‌ బాలకాండ అఖండ పారాయణం జ‌రుగ‌నుంది. నాదనీరాజనం వేదికపై ఉదయం 8.30 నుండి 10.30 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

బాలకాండలోని 66 నుండి 70 సర్గల వ‌ర‌కు గ‌ల 134 శ్లోకాలను పారాయణం చేస్తారు. అదేవిధంగా యోగవాసిస్టం, ధన్వంతరి మహామంత్రం కలిపి 25 శ్లోకాల పారాయణం జరుగుతుంది. మొత్తం 159 శ్లోకాలను పారాయణం చేస్తారు. ఎస్.వి. వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి.వేద విశ్వవిద్యాలయం, టిటిడి వేదపండితులు, టిటిడి సంభావన పండితులు, అన్నమాచార్య ప్రాజెక్ట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తులు ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోర‌డ‌మైన‌ది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.