CHAIRMAN, EO EXTENDS DEEPAVALI GREETINGS _ దీపావళి ప్రతి ఇంట్లో ఆనందం, సంతోషపు వెలుగులు నింపాలి – టీటీడీ చైర్మన్ , ఈవో దీపావళి శుభాకాంక్షలు

TIRUMALA, 23 OCTOBER 2022: TTD Chairman Sri YV Subba Reddy, EO Sri AV Dharma Reddy extended Deepavali wishes to the devotees of Srivaru who are present across the world and to employees of TTD.

They wished that on this auspicious day of the festival of lights let everyone lives shines with happiness and prosperity.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

దీపావళి ప్రతి ఇంట్లో ఆనందం, సంతోషపు వెలుగులు నింపాలి

– టీటీడీ చైర్మన్ , ఈవో దీపావళి శుభాకాంక్షలు

తిరుమల 23 అక్టోబరు 2022: దీపావళి పండుగ రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో ఆనందం సంతోషపు వెలుగులు నింపాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి ఆకాంక్షించారు . ఆదివారం ఒక ప్రకటనలో వారు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్రం లో సకాలంలో వర్షాలు కురిసి సర్వతోముఖాభివృద్ధి సాధించాలని వారు కోరారు. పర్యావరణానికి ఇబ్బంది కలిగించకుండా ప్రజలు పండుగ జరుపుకోవాలని వారు కోరారు. చెడు మీద ఎప్పుడూ మంచే విజయం సాధిస్తుందని నరకాసురవధ ప్రపంచానికి చాటిందని వారు చెప్పారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయడమైనది