CHATRAASTHAPANOTSAVAM AT NARAYANAGIRI SRIVARI PADALU ON JULY 30 _ జూలై 30న నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద ఛత్రస్థాపనోత్సవం

Tirumala, 29 July 2023: TTD is organising the annual festival of 

Chatrasthapanotsavam  at Narayanagiri Srivari Padalur on July 30 

As part of the festivities, a team of archakas will perform  Tirumanjanam and install a colourful umbrella at srivari padalu. Thereafter the Vedic Pundits perform special puja, naivedyam and Prasadam to devotees.

As per legend the festival was observed annually in recognition of Sri Venkateswara Swamys entry onto Holy Seshachala ranges by placing his first step on the Narayanagiri peak on Shravana Shudda Dwadasi day.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై 30న నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద ఛత్రస్థాపనోత్సవం

తిరుమల, 2023 జూలై 29: తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద జూలై 30వ తేదీ ఆదివారం ఛత్రస్థాపనోత్సవం జ‌రుగ‌నుంది. ఏడాదికోసారి ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులో భాగంగా నారాయణగిరిలోని శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించేందుకు ఆలయంలోని బంగారు బావి నుండి తీర్థాన్ని తీసుకుంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో రెండవ గంట తర్వాత పూజ సామాగ్రి, పుష్పాలు, నైవేద్యానికి ప్రసాదాలు సిద్ధం చేసుకుంటారు. రంగనాయకుల మండపం నుండి గొడుగులతో మంగళవాయిద్యాల నడుమ మహాప్రదక్షిణంగా మేదరమిట్ట చేరుకుంటారు.

అక్కడినుండి అర్చకులు నారాయణగిరి శిఖరం చేరుకుని బంగారుబావి నుండి తెచ్చిన తీర్థంతో శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి, అలంకారం, పూజ, నైవేద్యం సమర్పిస్తారు. తదనంతరం వేదపారాయణదారులు ప్రబంధ శాత్తుమొర నిర్వహించి, శ్రీవారి పాదాల చెంత గొడుగును ప్రతిష్టించి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తారు.

పురాణ ప్రాశస్త్యం

తిరుమల ఏడుకొండల్లో అత్యంత ఎత్తయిన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామివారు మొదటగా కాలు మోపినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా శ్రావణ శుద్ధ ద్వాదశినాడు ఛత్రస్థాపనోత్సవం నిర్వహిస్తారు.

ఈ ఉత్సవానికి మరో నమ్మకం కూడా ఉంది. సాధారణంగా ఈ కాలంలో గాలులు ఎక్కువగా వీస్తాయి. నారాయణగిరి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండడంతో మరింత ఎక్కువగా గాలులు వీస్తాయి. ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుని ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్టిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.