EIGHTH EDITION OF AKHANDA SUNDARAKANDA PARAYANAM HELD _ భక్తిభావాన్ని పంచిన సుందరకాండ అఖండ పారాయణం
Tirumala, 2 Jan. 21: The Eighth Edition of Akhand Sundarakanda parayanam held at nadaneerajanam Mandapam in Tirumala on Saturday.
With an aim to save the world from the clutches of Corona Virus, TTD has been organising Sundarakanda Parayanam since June 2020. So far, TTD has completed 7 editions of Sundarakanda akhanda parayanam.
During the eighth edition of Sundarakanda akhanda parayanam, a total of 195 slokas have been recited by nearly 200 Vedic scholars from 31 to 35 Sargas of Sundarakanda.
Veda Vignana Peetham Principal Sri KSS Avadhani lead the recitation of Shlokas. At the beginning of the program Annamacharya sankeertana while at the end of the program Hanuman Bhajan were rendered by the artistes of TTD.
Additional EO Sri AV Dharma Reddy, VC of National Sanskrit Varsity Sri Muralidhara Sharma, Annamacharya Project Director Sri Dakshinamurthy, Higher Vedic Studies Special Officer Sri Vibhishana Sharma, devotees were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
భక్తిభావాన్ని పంచిన సుందరకాండ అఖండ పారాయణం
తిరుమల, 2021 జనవరి 02: ప్రపంచంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై శనివారం ఉదయం సుందరకాండలోని 31వ సర్గ నుంచి 35వ సర్గ వరకు ఉన్న 196 శ్లోకాలను దాదాపు 200 మంది వేద పండితులు అఖండ పారాయణం చేశారు. ఈ కార్యక్రమం ఆద్యంతం భక్తిభావాన్ని పంచింది. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు తమ ఇళ్ల నుంచే పారాయణంలో పాల్గొన్నారు. ఈ 8వ విడత సుందరకాండ అఖండ పారాయణం ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరిగింది.
ఈ సందర్భంగా తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని మాట్లాడుతూ రామనామం ఎక్కడ పలికితే అక్కడ హనుమంతుడు ప్రత్యక్షమవుతాడని, హనుమంతుని అనుగ్రహం ఉంటే సకల కార్యాలు నెరవేరుతాయని చెప్పారు. రాముడు ఆచరించిన ధర్మం లోకానికి రక్ష అని, వేదోక్తమైన ధర్మాన్ని ఆచరించడం వలన ప్రపంచంలోని మానవులు సిరిసంపదలు, ఆయురారోగ్యాలతో ఉంటారని వివరించారు.
ఇప్పటివరకు ఏడు విడతల్లో అఖండ పారాయణం జరిగింది. జూలై 7న మొదటి విడతలో మొదటి సర్గలోని 211 శ్లోకాలు, ఆగస్టు 6న రెండో విడతలో 2 నుండి 7వ సర్గ వరకు 227 శ్లోకాలు, ఆగస్టు 27న మూడో విడతలో 8 నుండి 11వ సర్గ వరకు 182 శ్లోకాలు, సెప్టెంబరు 12న నాలుగో విడతలో 12 నుండి 14వ సర్గ వరకు 146 శ్లోకాలు, అక్టోబరు 4న ఐదవ విడత 15వ సర్గ నుంచి 19వ సర్గ వరకు 174 శ్లోకాలను, నవంబరు 3న ఆరో విడత 20వ సర్గ నుంచి 24వ సర్గ వరకు185 శ్లోకాలు, డిసెంబరు 6న ఏడవ విడత 25వ సర్గ నుంచి 30వ సర్గ వరకు ఉన్న మొత్తం 194 శ్లోకాలను అఖండ పారాయణం జరిగింది.
కాగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి సుష్మ బృందం ” ఎదురా రఘుపతికి …… ” , అనే సంకీర్తనను కార్యక్రమం ప్రారంభంలో, శ్రీ రఘునాథ్ బృందం ” శ్రీ హనుమ జయ హనుమ శ్రీ హనుమ జయ హనుమ……” అనే సంకీర్తనను కార్యక్రమం ముగింపులో సుమధురంగా అలపించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి దంపతులు, జాతీయ సంస్కృత వర్సిటి ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ దంపతులు, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీ దక్షిణామూర్తి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి శ్రీ విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.