తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ. 11.17 కోట్లు

తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ. 11.17 కోట్లు

తిరుమల, 2019 ఫిబ్ర‌వ‌రి 07: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలంలో టిటిడి రూ. 11.17 కోట్ల ఆదాయాన్ని గడించింది.

ప్రతినెలా మొదటి గురువారం నాడు తలనీలాల ఈ-వేలం జరుగుతున్న విషయం విదితమే. ఇందులోభాగంగా టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు పర్యవేక్షణలో తలనీలాల ఈ వేలం జరిగింది. మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, తెల్లవెంట్రుకలు తలనీలాల రకాల ఈ-వేలం నిర్వహించారు. ఈ నెల నిర్వహించిన ఈ-వేలంలో మొత్తం 1,43,900 కిలోల తలనీలాలు అమ్ముడుపోయాయి.

తలనీలాలలో మొదటి రకం(27 ఇంచుల పైన), రెండో రకం(19 నుండి 26 ఇంచులు), మూడో రకం(10 నుండి 18 ఇంచులు), నాలుగో రకం(5 నుండి 9 ఇంచులు), ఐదో రకం(5 ఇంచుల కన్నా తక్కువ) టిటిడి ఈ-వేలంలో పెట్టింది.

మొదటి ర‌కం తలనీలాలో కిలో రూ.26,005/-గా ఉన్న ఏ క్యాట‌గిరి – 2,900 కిలోలను వేలానికి ఉంచగా 200 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.52.01 లక్షల ఆదాయం సమకూరింది. అదేవిధంగా కిలో రూ.18,331/-గా ఉన్నబి క్యాట‌గిరి – 2,100 కిలోలు వేలానికి ఉంచగా 200 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.36.66 ల‌క్ష‌ల‌ ఆదాయం లభించింది.

రెండో రకం తలనీలాలో కిలో రూ.17,011/-గా ఉన్న ఏ క్యాట‌గిరి – 3,100 కిలోలను వేలానికి ఉంచగా, 3,100 కిలోలు అమ్ముడుపోయాయి.తద్వారా రూ.548.35 లక్షల ఆదాయం సమకూరింది. అదేవిధంగా కిలో రూ.8,529/-గా ఉన్నబి క్యాట‌గిరి – 9,500 కిలోలు వేలానికి ఉంచగా 4,300 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.366.79 ల‌క్ష‌ల‌ ఆదాయం లభించింది.

మూడో రకం తలనీలాలో కిలో రూ.6,020/-గా ఉన్న ఏ క్యాట‌గిరి 1,000 కిలోలను వేలానికి ఉంచారు. అన్నీ అమ్ముడుపోయాయి. తద్వారా రూ.60.22 లక్షల ఆదాయం లభించింది. కిలో రూ.4,553/-గా ఉన్న బి క్యాట‌గిరి – 11,700 కిలోలు వేలానికి ఉంచగా 100 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.4.55 ల‌క్ష‌ల‌ ఆదాయం సమకూరింది.

కిలో రూ.1,800/-గా ఉన్న నాలుగో రకం తలనీలాలను 2,500 కిలోలను వేలానికి ఉంచారు. ఏవీ అమ్ముడుపోలేదు.

కిలో రూ.36/-గా ఉన్న ఐదో రకం తలనీలాలను 1,35,000 కిలోలను వేలానికి ఉంచ‌గా 1,35,000 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.48.62 ల‌క్ష‌ల ఆదాయం సమకూరింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.