KOIL ALWAR HELD _ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘ‌నంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

TIRUPATI, 14 MAY 2024: The Koil Alwar Tirumanjanam was held with religious fervour in Sri Padmavati Ammavari temple at Tiruchanoor on Tuesday.

As the annual Vasanthotsavams are scheduled from May 22 to 24 with Ankurarpanam on May 21, this fete was observed.

Devotees shall pay Rs. 150 per ticket per person to participate in this festival.

On May 23, a procession of Swarna Ratham will be observed at 7:45am. Every day from 2:30pm to 4:30pm the spring festival is observed in Friday Gardens to the Utsava Murty of Ammavaru.

TTD has cancelled Arjita Kalyanotsavam, Sahasra Deepalankara Seva on May 21 to 24, Tiruppavada Seva on May 23, Lakshmi Puja and May 24.

Temple DyEO Sri Govindarajan, Archakas Sri Babu Swamy, Superintendent Sri Madhu, temple inspector Sri Subhaskar participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘ‌నంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

– మే 22 నుండి 24వ తేదీ వరకు వసంతోత్సవాలు

తిరుపతి, 2024 మే 14: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఈ సంద‌ర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చ‌న, శుధ్ధి నిర్వహించారు.

అనంతరం ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 22 నుండి 24వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం మే 21వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణ నిర్వ‌హిస్తారు. భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు.

ఉత్సవాల్లో భాగంగా మే 23వ తేదీ ఉదయం 7.45 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మ‌వారు విహరించి భ‌క్తుల‌ను కటాక్షించనున్నారు.

ఈ ఉత్స‌వాల కార‌ణంగా మే 21 నుండి 24వ తేదీ వ‌రకు క‌ల్యాణోత్స‌వం, సహ‌స్ర‌దీపాలంకార‌సేవ‌, మే 23న తిరుప్పావ‌డ సేవ‌, మే 24న లక్ష్మి పూజ ఆర్జిత‌సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద‌రాజ‌న్‌, అర్చకులు శ్రీ బాబుస్వామి, సూప‌రింటెండెంట్ శ్రీ మ‌ధు, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ సుభాష్‌ పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.