MANAGUDI PROGRAMME IN HYDERABAD _ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా మనగుడి ఉత్సవం

Hyderabad, 21 August 2013: Tirumala JEO Sri KS Sreenivasa Raju participated in the Managudi programme held at Sri Veeranjaneya Swamy temple in Secunderabad on Wednesday. In his address he said, the programe has revived the values treasured in Hindu Sanatana Dharma among the masses especially among the youth and children.
 
Former DPP Secretary Sri Kasireddy Venkat Reddy and others took part.
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
 

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా మనగుడి ఉత్సవం

 తిరుపతి, ఆగస్టు 21, 2013: – భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మరిచిపోతున్న నేటి సమాజంలో మన సంస్కృతిపై మక్కువ పెంచి దేవాలయాలను కాపాడుకునే బాధ్యతను పౌరులలో పెంచేందుకే ఈ మనగుడి కార్యక్రమం.

– శ్రావణ పౌర్ణమి, కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి జన్మనక్షత్రమైన శ్రవణం పర్వదినాన తిరుమల తిరుపతి దేవస్థానం, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 21,000 ఆలయాల్లో మనగుడి ఉత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.

– అన్ని ఆలయాల్లో ఉదయం 5.00 గంటల నుండి నామసంకీర్తనంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

– ఆయా ఆలయ సంప్రదాయరీతిలో అభిషేకం, అర్చన, సామూహిక పారాయణం, వస్త్ర సమర్పణ జరిగాయి.

– తిరుమల నుండి  వచ్చిన పసుపు, కుంకుమలతో పాటు కంకణాలు, అక్షింతలు, ప్రసాదాలను ఆయా ఆలయాల దేవతల ముందుంచి, కుంకుమార్చనలు, సౌభాగ్యవ్రతాలు చేయడం జరిగింది.

– రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 కోట్ల కంకణాలను ఈ శుభదినాన భక్తులు ధరించడం జరిగింది.

– రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గౌ|| శ్రీ రామచంద్రయ్య గుడిమల్కాపురంలోని ఆలయంలో మనగుడి కార్యక్రమంలో పాల్గొన్నారు.

– సాయంత్రం 4.00 గంటల వరకు అందిన సమాచారం మేరకు ఆంధ్రప్రధేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలల్లో 21,142 ఆలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించారు.

– రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మనగుడి కార్యక్రమంలో ఎం.పిలు, ఎం.ఎల్‌.ఏలు, ఎం.ఎల్‌.సిలు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

– విశాఖపట్నం జిల్లాలోని పాడేరులోగల శ్రీరామ ఆలయంలో రాష్ట్ర మంత్రివర్యులు గౌ|| శ్రీ బాలరాజు, అనకాపల్లిలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయం గౌ|| జి.శ్రీనివాస్‌ మనగుడి కార్యక్రమంలో పాల్గొన్నారు.