NARASIMHA JAYANTI OBSERVED IN TIRUMALA SHRINE _ శ్రీవారి ఆలయంలో శ్రీ నృసింహ జయంతి

Tirumala, 25 May 2021: On the auspicious occasion of Narasimha Jayanti on Tuesday, special pujas were performed in Sri Yoga Narasimha Swamy sub-temple located in Tirumala main temple.

Every year in the sacred month of Vaisakha, on the advent of Swati star, special abhishekam is performed to Sri Yoga Narasimha Swamy Mulamurty amidst chanting of Veda mantras by Archakas.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో శ్రీ నృసింహ జయంతి

తిరుమల, 2021 మే 25: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగ‌ళ‌వారం రాత్రి నృసింహ జయంతి ప్రత్యేక పూజా కార్యక్రమం జరిగింది. ప్రతి ఏటా వైశాఖ మాసంలో ఈ ఉత్సవం నిర్వ‌హిస్తారు. ఈ సందర్భంగా రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు శ్రీ యోగ నరసింహస్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

శ్రీవారి ఆలయ మొదటి ప్రాకారంలో గర్భాలయానికి ఈశాన్యం వైపున గల మండపంలో పడమరగా శ్రీ యోగ నరసింహస్వామివారి ఉప ఆలయం ఉంది. యోగముద్రలో ఉన్న ఈ విగ్రహాన్ని శాస్త్ర ప్రకారం రూపొందించారు. స్వామివారికి నాలుగు చేతులుంటాయి. పైభాగంలో ఉన్న చేతులలో శంఖుచక్రాలు కనిపిస్తాయి. కింది రెండు చేతులు ధ్యాననిష్టను సూచిస్తాయి. క్రీ.శ 1330 నుంచి క్రీ.శ 1360 మధ్య కాలంలో నిర్మితమైన ఈ ఆలయంలో శ్రీ రామానుజాచార్యుల వారు శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

టిటిడి ప్ర‌జాసంబంధాల అధికారిచే విడుద‌ల చేయ‌బ‌డిన‌ది.