NARASIMHA PUJA PERFORMED IN VASANTA MANDAPAM _ వ‌సంత మండ‌పంలో శాస్త్రోక్తంగా శ్రీ నృసింహ పూజ

TIRUMALA, 22 MAY 2024: On the auspicious occasion of Nrisimha Jayanti, a special puja was performed to Narasimha Swamy in Vasanta Mandapam at Tirumala on Wednesday evening.

As a part of this  Nrisimha Astottara Satanamavali, 108 times Sri Nrisimha Mantram, 24 times Sri Sudarshana Mantram were recited.

Vedic pundits were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వ‌సంత మండ‌పంలో శాస్త్రోక్తంగా శ్రీ నృసింహ పూజ‌

తిరుమల, 2024, మే 22: వైశాఖ మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీ నృసింహ జ‌యంతిని పుర‌స్కరించుకుని తిరుమల‌ వసంత మండపంలో బుధవారం శ్రీ నృసింహ పూజ శాస్త్రోక్తంగా జ‌రిగింది.

మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల‌ వరకు జ‌రిగిన ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ప్రత్యక్ష ప్రసారం చేసింది.

ఇందుకోసం శ్రీవారిని నృసింహ స్వామి అలంకారంలో సింహ వాహ‌నంపై కొలువుదీర్చారు. సుద‌ర్శ‌న చ‌క్రం, నర‌సింహుని ప్ర‌తిమ‌ను ఏర్పాటుచేశారు. అభిముఖంగా శ్రీ న‌ర‌సింహ‌స్వామివారి ప్ర‌తిమ‌లను ఆశీనుల‌ను చేశారు.

పూజ‌లో భాగంగా శ్రీ నృసింహ మంత్రాన్ని 108 సార్లు, శ్రీ నృసింహ అష్టోత్త‌ర శ‌త‌నామావ‌ళి, శ్రీ సుద‌ర్శ‌న మంత్రాన్ని 24 సార్లు పారాయ‌ణం చేసినట్టు చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆల‌య అర్చ‌కులు, ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం పండితులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.