NEW SET OF SRIVARI PADALU IN NARAYANAGIRI _ నూతన శ్రీవారి పాదాల నిర్మాణానికి శాస్త్రోక్తంగా పూజలు
నూతన శ్రీవారి పాదాల నిర్మాణానికి శాస్త్రోక్తంగా పూజలు
తిరుమల, సెప్టెంబరు 18, 2013: తిరుమలలోని నారాయణగిరిలో నూతన శ్రీవారి పాదాల ఏర్పాటుకు బుధవారం తితిదే ధర్మకర్తల మండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరు బాపిరాజు, కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.జి.గోపాల్, జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, అర్చకబృందంతో కలిసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీవారి పాదాల నిర్మాణపనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా తితిదే ఛైర్మన్, ఈవో, జెఈవో మాట్లాడుతూ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకు తిరిగి నూతన పాదాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. శ్రీవారి పాదాలకు త్వరలో కవచాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సోమవారం నాటికి శ్రీవారి పాదాల ఏర్పాటు పనులు పూర్తి చేస్తామని, ఆ తరువాత భక్తులను ఎప్పటినుండి దర్శనానికి అనుమతించాలనే విషయాన్ని త్వరలోనే తెలియజేస్తామని వెల్లడించారు. శ్రీవారి పాదాలకు ఆగమశాస్త్రాల్లో ప్రత్యేకంగా ఆరాధనా విధానం లేదని, ఈ కారణంగా భక్తులు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టకుండా నిలిపివేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తితిదే సివిఎస్వో శ్రీ జివిజి.అశోక్ కుమార్, ఆగమ సలహాదారు శ్రీ సుందరవదన భట్టాచార్య, ఓఎస్డి శ్రీ శేషాద్రి, అర్చక బృందం ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.