NO ALTERNATIVE FOR TTD IN HINDU DHARMA PRACHARA – PONTIFFS _ ధార్మిక సదస్సులో చివరిరోజు స్వామీజీల అనుగ్రహ భాషణం

Tirumala, 05 February 2024: The three-day Sri Venkateswara Dharmic Conference at Tirumala Asthana Mandapam concluded on Monday. Various Peethadhipathis offered their valuable suggestions.

HH SRI VEDA VARDHANA THEERTHA SWAMIJI, SRI SHIRUR MUTT, UDIPI

Efforts should be made to guide the youth on the right path.  The charitable programs of Tirumala Tirupati Devasthanam are very good. 

Sri Paravakottai Chinna Andavan Sri Srinivasa Gopala Mahadesikan Swami, Pandarikapuram Ashram, Srirangam

Tirumala Tirupati Devasthanam is already serving the devotees with various religious and charitable activities.  There is no alternative to Tirumala Tirupati Devasthanam in Dharma propagation.  

SRI VIDYENDRA THEERTHA SWAMIJI, CHITTAPUR MUTT, UDIPI

If we protect Dharma, it will protect us.  

HH SRI SADASIVA SHARMA SWAMIJI, VARANASI

Sri Vishnusahasra Nama Parayanam and Sanskrit Subhasitas should be specially taught.  Actions should be taken to prevent the spread of Western culture.  There is a need to expand TTD’s charitable and service programs to the international level.

SRI SUVIDYENDRA THEERTHA SWAMIJI, SRI RAGHAVENDRA SWAMY MUTT, BANGALORE

There is a need for TTD to preserve the Vedas.  The preservation of Vedas is the preservation of Dharma.  There is a great need for cow protection.  Temples should be built in every village.  Efforts should be made for the development of the Sanskrit language.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ధార్మిక సదస్సులో చివరిరోజు స్వామీజీల అనుగ్రహ భాషణం

ఫిబ్రవరి 05, తిరుమల, 2024: తిరుమల ఆస్థాన మండపంలో మూడు రోజుల పాటు జరిగిన శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు సోమవారం ముగిసింది. చివరి రోజు పలువురు స్వామీజీలు అనుగ్రహ భాషణం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీ వేదవర్ధన స్వామి, ఉడిపి మఠం

చిన్నపిల్లలకు భగవంతుని పట్ల అవగాహన కల్పించేందుకు ప్రతి ఊరిలో వారానికి ఒకసారి ప్రవచనాలు, ప్రార్థన గురించి తెలపాలి. యువతను సన్మార్గంలో నడిపించడానికి కృషి చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న ధార్మిక కార్యక్రమాలు చాలా బాగున్నాయి. సంతోషంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారికి కృతజ్ఞతలు.

శ్రీ పరవకొట్టై చిన్న ఆండవన్ శ్రీ శ్రీనివాస గోపాల మహాదేశికన్ స్వామి, పాండరికపురం ఆశ్రమం, శ్రీరంగం

తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికే భక్తులకు అద్భుతంగా సేవలందిస్తోంది. సప్తగిరి పత్రిక ద్వారా మరింతగా వివరాలు తెలియవస్తున్నాయి. శ్రీనివాస కళ్యాణం ద్వారా అందరికీ భక్తిని చాటేలా చేస్తున్నారు. ధర్మ ప్రచారంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రత్యామ్నాయం లేదని చెప్పవచ్చు. ఈ సేవ మరింత విజయవంతం కావాలి. పాఠశాలలు, కళాశాలల్లో పిల్లలకు నైతిక పోటీలు నిర్వహించి మన సంప్రదాయాలను కొనసాగించాలి. వేదాలను భారతదేశమంతటా ప్రచారం చేయాలి.

శ్రీ విద్యేంద్ర తీర్థ స్వామీజీ, చిత్రాపూర్ మఠం, కర్ణాటక.

ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. హిందూ సనాతన ధర్మాన్ని అన్నిచోట్లా ప్రచారం చేయాలి. సమాజానికి సేవ చేయడం వల్ల మనకు పుణ్యఫలం దక్కుతుంది. ఇలాంటి ధార్మిక సదస్సు నిర్వహిస్తున్న టీటీడీ పాలకమండలి అధ్యక్షులకు, ఈవో గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము.

శ్రీ సదాశివ ఆశ్రమ స్వామిజీ, శృంగేరి బ్రహ్మానంద మఠం, వారణాసి.

శ్రీవిష్ణుసహస్ర నామ పారాయణం, సంస్కృత సుభాషితాలు ప్రత్యేకంగా బోధించాలి. పాశ్చాత్య సంస్కృతి పెచ్చరిల్లకుండా చర్యలు తీసుకోవాలి. టీటీడీ ధార్మిక, సేవా కార్యక్రమాలను అంతర్జాతీయ స్థాయికి విస్తరించాల్సిన అవసరం ఉంది.

శ్రీ సువిద్యేంద్ర తీర్థ స్వామి, రాఘవేంద్ర మఠం, బెంగళూరు.

టీటీడీ వారు వేద పరిరక్షణ చేయవలసిన ఆవశ్యకత ఉంది. వేద పరిరక్షణే ధర్మ పరిరక్షణ. గోసంరక్షణ ఆవశ్యకత చాలా ఉంది. ప్రతి గ్రామంలో దేవాలయాలు నిర్మించాలి. సంస్కృత భాష అభివృద్ధికి కృషి చేయాలి.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.