ఆగష్టు 5, 6 తేదీలలో ఒంటిమిట్ట ఆలయ వ్యవసాయ భూమి కౌలు / లీజుకు వేలం

ఆగష్టు 5, 6 తేదీలలో ఒంటిమిట్ట ఆలయ వ్యవసాయ భూమి కౌలు / లీజుకు వేలం

తిరుపతి, 2018 ఆగష్టు 03: టిటిడి అనుబంధ ఆలయమైన కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి దేవాలయంకు చెందిన 19.97 ఎకరాల వ్యవసాయ భూమిని జూలై 2019 – 2020 సంవత్సరానికి గాను కౌలు / లీజుకు ఇవ్వడానికి వేలం వేయనున్నారు. ఈ భూములను కౌలుకు తీసుకునేందుకు ఆసక్తియున్న వారి నుండి సీల్డు టెండర్లు ఆహ్వానించడమైనది. ఒంటిమిట్ట, మల్లకటుపల్లి, చెర్లోపల్లి గ్రామంలోని వ్యవసాయ భూములను ఆగష్టు 5, 6 తేదిలలో ఉ. 11 గంటలకు టెండర్ సహిత వేలం పాట వేయబడును.

టెండరు ధరఖాస్తులు కావలసిన వారు కార్యనిర్వహణాధికారి, టిటిడి, తిరుపతి పేరిట రూ.224 డిడిని తీసుకోవాలి. వేలము పాట ప్రారంభించే ముందు వరకు డిడిలను సమర్పించి సహాయ కార్యనిర్వహణాధికారి (రెవెన్యూ), టిటిడి పరిపాలన భవనము, తిరుపతి వద్ద లేదా టెంపుల్ ఇన్ స్పెక్టర్, శ్రీ కోదండరామస్వామి దేవాలయం, ఒంటిమిట్ట వారి నుండి ధరఖాస్తులు పొందవచ్చు. వ్యవసాయ భూమి విస్తీర్ణం బట్టీ టిటిడి నిర్ణయించిన ఇ.ఎం.డి కొరకు ఆయా డిడిలను జత చేయాలి. నింపబడిన సీల్డు టెండరు ఫారములు వేలము పాట ప్రారంభించే ముందు వరకు స్వీకరించబడును.

ఇతర వివరాలకు ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి వారి ఆలయ డిప్యూటీ కార్యాలయం అధికారులను సంప్రదించవలెను.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.