భక్తులకు అందుబాటులో శ్రీ వికారి నామ సంవత్సర పంచాంగం

భక్తులకు అందుబాటులో శ్రీ వికారి నామ సంవత్సర పంచాంగం

తిరుమల, 2019 మార్చి 17: శ్రీ వికారి నామ సంవత్సర పంచాంగాన్ని తిరుమల, తిరుపతిలోని టిటిడి పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉంచడమైనది. దీని ధరను రూ.55/-గా టిటిడి నిర్ణయించింది. టిటిడి ప్రతి ఏడాదీ ప్రతిష్టాత్మకంగా పంచాంగాన్ని ముద్రించి భక్తులకు అందజేస్తున్న విషయం తెలిసిందే.

ఈ పంచాంగాన్ని టిటిడి ఆస్థాన సిద్ధాంతి శ్రీ తంగిరాల వేంకటకృష్ణ పూర్ణ ప్రసాద్‌ సిద్ధాంతి రచించగా వైఖానసాగమ పండితులు ఆచార్య వేదాంతం విష్ణుభట్టాచార్యులు పరిష్కరించారు. మొత్తం 60 వేల ప్రతులను టిటిడి ముద్రించింది.

వచ్చేవారం నుండి దేశవ్యాప్తంగా ఉన్న టిటిడి సమాచార కేంద్రాలలో ఈ పంచాంగాన్ని అందుబాటులో ఉంచుతారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.