PANGUNOTTARA UTSAVAM CONCLUDES _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ముగిసిన పంగుణోత్తర ఉత్సవం

Tirupati, 28 Mar. 21Pangunottara Utsavam concluded in Sri Govindaraja Swamy temple on Sunday at Tirupati.

Sri Govindaraja made a round about in process along Pundarkavalli Tayar temple.

Temple officials present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ముగిసిన పంగుణోత్తర ఉత్సవం

తిరుప‌తి, 2021 మార్చి 28: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో గల శ్రీ పుండరీకవళ్లి (సాలైనాంచియార్‌) అమ్మవారి పంగుణి ఉత్తర ఉత్సవం ఆది‌వారం ఘనంగా ముగిసింది.

ఈ సందర్భంగా ఉదయం అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి విశ్వరూప సర్వదర్శనం కల్పించారు. అనంతరం ఏకాంతంగా తిరుమంజనం నిర్వహించారు. ఉదయం శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి సన్నిధిలో వేడుకగా స్నపన తిరుమంజనం జరిగింది. అనంతరం ఆస్థానం నిర్వహించారు.

సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ పుండరీకవళ్లి అమ్మవారిని ఆలయ విమానప్రాకారం చుట్టూ ఊరేగించారు. ఆ త‌రువాత‌ ఊంజల్‌సేవ నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ‌ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ వెంక‌టాద్రి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునీంద్ర‌బాబు, శ్రీ కామ‌రాజు, అర్చ‌కులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.‌

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.