PARAMAPADA VAIKUNTHANADHA GRACES ON PEDDA SESHA _ పెద్దశేష వాహనంపై వైకుంఠ నాధుడి అలంకారంలో శ్రీ గోవింద‌రాజ‌స్వామి

Tirupati, 18 May 2021: On the first day of the ongoing annual Brahmotsavams in Sri Govindaraja Swamy temple in Tirupati, the Utsava deities graced on Pedda Sesha Vahanam on Tuesday evening.

In view of the Covid pandemic the Vahana Seva was observed in Ekantam.

Senior and Junior pontiffs of Tirumala, Spl.gr.DyEO Sri Rajendrudu and other staffs were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

పెద్దశేష వాహనంపై వైకుంఠ నాధుడి అలంకారంలో శ్రీ గోవింద‌రాజ‌స్వామి

తిరుపతి, 2021 మే 18: తిరుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు మంగ‌ళ‌వారం సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు పెద్దశేష వాహనంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు ప‌ర‌మ‌ప‌ద వైకుంఠ నాధుడి అలంకారంలో క‌టాక్షిచారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ నిర్వ‌హించారు.

శేషుడు స్వామివారికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నారు. శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలె నాకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలితాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు అనుగ్రహిస్తారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌‌ రెడ్డి, కంక‌ణ బ‌ట్టార్ శ్రీ ఏ.టి. పార్థ‌సార‌ధి దీక్షితులు, సూపరింటెండెంట్లు శ్రీ కుమార్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ మునీంద్ర‌బాబు, శ్రీ కామ‌రాజు, అర్చకులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.