PARTHASARADHI TAKES RIDE ON FLOAT

Tirupati, 3 Feb. 20: On the second day of ongoing Teppotsavams at Sri Govindaraja Pushkarini in Tirupati on Monday, Sri Parthasaradhi Swamy took out celestial ride on float.

Accompanied by Rukmini and Satyabhama, Sri Parthasaradhi Swamy has taken out five rounds in the sacred waters of Pushkarini.

Spl. Gr. DyEO Smt Varalakshmi and other officials, devotees participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

 
తెప్పపై శ్రీపార్థసారథిస్వామివారి విహారం
 
తిరుపతి, 2020 ఫిబ్రవరి 03 ;తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమ‌వారం సాయంత్రం శ్రీ రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీ పార్థసారథిస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. 
 
ఇందులో భాగంగా ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై విహరించి భక్తులను క‌టాక్షించారు. త‌ర్వాత‌ ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్ర‌హించ‌నున్నారు. 
 
స్వామివారు మొత్తం ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అదేవిధంగా మంగ‌ళ‌వారం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు తెప్పలపై భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.
 
ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ్య‌ర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ శ‌ర్మ‌, రాజ్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ కృష్ణమూర్తి, శ్రీ మునీంద్ర‌బాబు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.