PAVITROTSAVAMS CONCLUDES _ అప్పలాయగుంటలో ముగిసిన పవిత్రోత్సవాలు
TIRUPATI, 23 SEPTEMBER 2022: The annual Pavitrotsavams concluded with Pavitra Purnahuti in Appalayagunta on Friday.
AEO Sri Prabhakar Reddy, Superintendent Smt Srivani, temple Inspector Sri Venkata Siva were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అప్పలాయగుంటలో ముగిసిన పవిత్రోత్సవాలు
తిరుపతి, 2022 సెప్టెంబరు 23: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, అర్చన చేపట్టారు. ఆ తరువాత యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసస్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం తిరువీధి ఉత్సవం జరిగింది. ఆ తరువాత నిర్వహించిన పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ వెంకటశివ తదితరులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.