PEDDA SESHA VAHANAM ON OCTOBER 29 _ అక్టోబరు 29న పెద్దశేష వాహనంపై శ్రీ మలయప్ప దర్శనం
TIRUMALA, 26 OCTOBER 2022: On the auspicious occasion of Nagula Chaviti on October 29, Pedda Sesha Vahana Seva will be observed in Tirumala.
Sri Malayappa Swamy will take a celestial ride between 7pm and 9pm to bless His devotees along four Mada streets.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
అక్టోబరు 29న పెద్దశేష వాహనంపై శ్రీ మలయప్ప దర్శనం
తిరుమల, 2022 అక్టోబరు 26: అక్టోబరు 29వ తేదీన నాగులచవితి పర్వదినం సందర్భంగా తిరుమలలో శ్రీ మలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి తిరుమాడ వీధులలో పెద్దశేషవాహనంపై భక్తులకు దర్శమిస్తారు.
శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్యపూజలందుకుంటున్నాడు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు. ఈ విధంగా స్వామివారు దాసభక్తికి మారురూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయదేవేరులతో కూడి ఊరేగుతూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని కూడా సాక్షాత్కరింపచేస్తాడు. అందుకే బ్రహ్మోత్సవ వాహనసేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఆ భగవంతుడు ప్రసాదించారు.
కాగా, రాత్రి 7 నుండి 9 గంటల నడుమ పెద్దశేష వాహన సేవ జరుగనుంది.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.