PILGRIMS FLOOD TIRUMALA-30HRS FOR SARVA DARSHAN _ కొండంతా జనం – ఏర్పాట్లను పరిశీలించిన జె.ఇ.ఓ

TIRUMALA, JUNE 8:  The hill town of Tirumala on Sunday witnessed heavy pilgrim influx leading to serpentine queue lines for different categories of darshan.
 
Tirumala JEO Sri KS Srinivasa Raju along with Additional CVSO Sri Shivakumar Reddy and other officials  inspected  queue lines and personally monitored the facilities including food, buttermilk, water etc. that are being offered to the multitude of visiting pilgrims.
 
Later speaking to media persons, the JEO said, on Saturday over 37thousand pilgrims reached Tirumala trekking Srivari mettu and Alipri foot path routes while on Sunday by 1pm itself over 27thousand divya darshan tokens has been issued. “This has clear impact on other queue lines also which led to long waiting hours. It is taking nearly 28-30hours for the Sarva Darshan, 10-12hrs for footpath and 8-10hrs for the Rs.300 darshan”, he maintained.
 
Adding futher he said “in the wake of this unprecedented rush we have cancelled VIP beginning break darshan except for the very important protocol VIPs on Monday so that we can provide darshan to another 10-15thousand pilgrims during this time slot. Even Rs.300 darshan has also been stopped by 10am on Sunday. Our top priority is to provide darshan to free and footpath pilgrims. Our officers and staff are doing commendable services to the pilgrims. We have been continuously announcing the darshan timings to the pilgirms”, he added. 
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కొండంతా జనం – ఏర్పాట్లను పరిశీలించిన జె.ఇ.ఓ

తిరుమల,  16 జూన్‌  2013 : వారాంతపు సెలవులు కావడంతో తిరుమల పుణ్యక్షేత్రం భక్తజనసంద్రమైంది. తిరుమలకు విచ్చేసే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ముఖ్యంగా కాలినడక యాత్రికుల సంఖ్య సాధారాణ రోజులకన్నా ద్విగుణీకృతమైంది. శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన రద్దీ సోమవారం రాత్రిదాకా కొనసాగే ఆవకాశం ఉందని తి.తి.దే అధికారుల అంచనా వేస్తున్నారు. కాగా ఆదివారం నుండి తిరుమలకు భక్తుల తాకిడి మరింత పెరగడంతో  సర్వదర్శనానికి 30 గంటలు, కాలిబాట దర్శనానికి 12 గంటలు, రూ.300/- దర్శనానికి 10 గంటల సమయం పడుతున్నది.
తిరుమలకు వెళ్ళే అలిపిరి కాలిబాట మరియు శ్రీవారిమెట్టు కాలిబాటల్లో యాత్రికుల సంఖ్య సాధారణ రోజుల్లో 6000 నుండి 10,000 నడుమ ఉండగా వారాంతపు సెలవు దినాల్లో దాదాపు 15,000 కు చేరుకుంటుంది. అటువంటిది ఈ సంఖ్య శనివారం 37,000ల మంది, ఆదివారం మధ్యాహ్నం సమయానికే ఈ సంఖ్య 27,000లకు పైగా కావడంతో తిరుమల భక్తజనసంద్రమైంది.

ఏర్పాట్లను పరిశీలించిన జె.ఇ.ఓ ః-

తిరుమలలో అనూహ్యస్థాయిలో పెరిగిన రద్దీ దృష్ట్యా తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్‌. శ్రీనివాసరాజు వివిధ విబాగాధిపతులను వెంటపెట్టుకొని తిరుమలలోని వివిధ మార్గాల క్యూలైన్లలో కలియతిరిగారు. ఎప్పటికప్పుడు భక్తులకు అందిస్తున్న అన్నప్రసాద వితరణ, త్రాగునీటి పంపిణీ తీరును మ్యాన్‌ప్యాక్‌ ద్వారా వాకబుచేసి, సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. మరో ప్రక్క భక్తులకు వివిధ దర్శనాలకు సంబంధించిన భక్తులకు దర్శన సమయాన్ని గురించి మైక్‌సెట్‌ద్వారా నిరంతరాయంగా ప్రకటనలు చేస్తూ, భక్తులకు తెలిసేలా చర్యలు చేపట్టారు.
అనంతరం జె.ఇ.ఓ తనను కలసిన మీడియావారితో మాట్లాడుతూ కాలిబాట భక్తుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరగుతున్న కారణంగా దాని ప్రభావం ఇతర దర్శన భక్తులపై చూపుతున్నదన్నారు. తద్వారా అన్ని దర్శనాల క్యూలైన్లలో ఉన్న భక్తులు స్వామి దర్శనం కోసం అధిక సమయం వేచివుండాల్సిన పరిస్థితి ఉందన్నారు. అయితే తమ అధికార సిబ్బంది కూడా గత మూడురోజులుగా భక్తుల మద్య కలియ తిరుగుతూ వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చక్కటి ఏర్పాట్లు చేశారన్నారు. ఇందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. కాగా భక్తుల రద్దీ దృష్ట్యా సోమవారం ఉదయం వి.ఐ.పి విరామదర్శనం రద్దు చేస్తునట్లు తెలిపారు. అయితే ప్రోటోకాల్‌ వి.ఐ.పిలలో అత్యంత ప్రముఖులకు మాత్రం దర్శనం కల్పిస్తునట్లు ఆయన తెలిపారు.
ఈ ఏర్పాట్ల తనిఖీలో తిరుమల జె.ఇ.ఓతో పాటు అదనపు సి.వి.ఎస్‌.ఓ శ్రీ శివకుమార్‌ రెడ్డి, ఇంజనీరింగ్‌ అధికారులు ఇ.ఇలు శ్రీ క్రిష్ణారెడ్డి, శ్రీ నరసింహమూర్తి, శ్రీ సుబ్రహ్మణ్యం, ఎలట్రికల్‌ డి.ఇ.ఇ శ్రీ రవిశంకర్‌ రెడ్డి, రిసెప్షన్‌ డిప్యూటి.ఇ.ఓ1 శ్రీ వెంకటయ్య, అన్నదానం  డిప్యూటి.ఇ.ఓ శ్రీ వేణుగోపాల్‌, క్యాటరింగ్‌ అధికారి శ్రీ శాస్త్రి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.