PROCESSION OF GOLDEN CHARIOT IN TIRUCHANUR _ వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి స్వర్ణరథోత్సవం

Tiruchanur, 25 May 2013: On the Second day of ongoing Three Day Annual Vasanthotsavam, the processional deity of Goddess Padmavathi is taken out in a procession atop GOLDEN CHARIOT around four mada street of Sri Padmavathi Ammavari Temple, Tiruchanur on Saturday morning.
 
Sri Siva Reddy Dy.E.O(Services),Sri Bhaskar Reddy, DyEO(PAT), Smt.B.Naga Ratnamma A.E.O,Temple staff and large number of women devotees took part.
 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి స్వర్ణరథోత్సవం

తిరుపతి, మే 25, 2013:తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా శనివారం స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా స్వర్ణరథం మంటపానికి తీసుకెళ్లారు. ఉదయం 7.00 నుండి 7.30 గంటల వరకు స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది. బంగారు రథాన్ని అధిరోహించిన అమ్మవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం స్నపనతిరుమంజనం, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ భాస్కర్‌రెడ్డి, ఏఈఓ శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్‌ శ్రీ శేషగిరి, ఆర్జితం ఇన్‌స్పెక్టర్‌ శ్రీ వెంకటరమణారెడ్డి ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
            ———————————————————————
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.