జూలై 8న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పుష్పయాగం

జూలై 8న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పుష్పయాగం

తిరుపతి, 2019 జూలై 03: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 8వ తేదీన పుష్పయాగ మహోత్సవం జ‌రుగ‌నుంది. ఇందుకోసం జూలై 7న సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకు సేనాధిప‌తి ఉత్స‌వం, పుష్పయాగానికి అంకురార్పణ నిర్వ‌హిస్తారు.

జూలై 8న ఉదయం 9.30 గంటలకు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలు, ప‌త్రాల‌తో స్వామివారికి అభిషేకం చేస్తారు. అనంతరం సాయంత్రం 6.00 గంటలకు వీధి ఉత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.516/- టికెట్‌ కొనుగోలుచేసి పుష్పయాగంలో పాల్గొనవచ్చు.

ఈ ఆల‌యంలో మే 11 నుండి 19వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జ‌రిగాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తార‌ని అర్చ‌కులు తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.