PUSHPAYAGAM HELD IN GT _ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో క‌న్నుల‌పండుగ‌గా పుష్పయాగం 

TIRUPATI, 26 JUNE 2023: The annual Pushpayagam was held with religious fervour in Sri Govindaraja Swamy temple on Monday in Tirupati.

In the morning Snapana Tirumanjanam was held to the utsava deities followed by Pushpayagam in the afternoon between 1pm and 4pm with a dozen varieties of flowers in a colourful manner.

Temple DyEO Smt Shanti, Garden Dy Director Sri Srinivasulu and others, devotees were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో క‌న్నుల‌పండుగ‌గా పుష్పయాగం

తిరుపతి, 2023 జూన్ 26: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో సోమ‌వారం పుష్పయాగం అంగరంగ వైభవంగా జరిగింది.

ఉదయం 9.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. అనంతరం ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ ఎపి శ్రీనివాస దీక్షితులు ఆధ్వర్యంలో మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 4 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది.

ఇందులో మల్లెలు, రుక్షి, కనకాంబరాలు, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల సాంప్రదాయ పుష్పాలు, తుల‌సి, మ‌రువం, ద‌మ‌నం, బిల్వం, ప‌న్నీరాకు పత్రాలు కలిపి మొత్తం 3 టన్నులతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. ఈ పుష్పాలను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి దాతలు విరాళంగా అందించారు.

మే 26 నుండి జూన్ 3వ తేదీ వరకు వరకు ఆల‌యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. బ్ర‌హ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికారులు, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ.

సాయంత్రం 6-30 గంటలకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఉద్యానవ‌న‌ విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్‌ శ్రీ శ్రీనివాసులు, ఏఇవో శ్రీ ర‌వికుమార్, సూపరింటెండెంట్‌ శ్రీ మోహన్ రావు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.